ఎనుముల రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మాస్ లీడర్‌గా ఎనుముల రేవంత్ రెడ్డి గుర్తింపు సాధించారు. దూకుడు ఆయనకు ప్లస్.. ఓ రకంగా మైనస్ కూడా అదే. తెలంగాణ పీసీసీ చీఫ్‌‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కు తెలంగాణలో పూర్వవైభవం తీసుకొచ్చేందుకు అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం మల్కాజిగిరి నియోజకవర్గ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉన్న వారిలో అగ్రస్థానం రేవంత్‌దే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009-2014 వరకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో 2004-2018 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు.

రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లిలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్న రేవంత్ రెడ్డి.. ధివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేనకోడలు గీతను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన రేవంత్ రెడ్డి.. 2006లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మిడ్జిల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. తెలంగాణ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇంకా చదవండి

రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్‎కు కలిసొచ్చేనా ? గెలుపుపై సీఎం రేవంత్ వ్యూహం ఇదేనా..

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో లాభం చేకూర్చుతుందా? ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందా? ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి కలిసొస్తుందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఈ ఎన్నికల్లో 400 పైగా సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యం విధించుకోవడం వెనుక ఒక కుట్ర దాగి ఉందని, రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఇటీవల ముఖ్యమంత్రి సంచలన ఆరోపణ చేశారు.

సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

తెలంగాణ గడ్డ మీద సవాళ్ల రాజకీయం నడుస్తోంది. సీఎం రేవంత్‌కు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ చేసిన అభివృద్ధిపై సీఎం రేవంత్‌కు మాట్లాడే దమ్ము, ధైర్యం ఉందా అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ చేసిన అభివృద్దిపై చర్చకు తాను సిద్ధం అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న దశాబ్దం పాటు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు, ఏ విధమైన పథకాలు తీసుకొచ్చారు, తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలన్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 3:22 pm

అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో తెలంగాణ వర్సెస్ ఢిల్లీ పోలీస్..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో ఢిల్లీ పోలీసులు స్పీడ్ పెంచారు. ఢిల్లీ పోలీసుల యాక్షన్‌కు ముందుగానే హైదరాబాద్ పోలీసులు రంగంలోకి దిగిపోయారు. తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె సతీశ్, సోషల్ మీడియా టీంలోని సభ్యులు అస్మా, తస్లీమా, గీత, శివలను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.

Telangana: లోక్‌సభ ఎన్నికల వేళ.. కమలదళం ఎంపీపై కాంగ్రెస్ అగ్రజుడి ప్రేమాభిమానాల.. మతలబేంటో..?

ఆయన ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ.. ఆదివాసీ ఉద్యమ నేత.. నిన్నమొన్నటి వరకు ఉద్యమాల్లో దూకుడుగా వ్యవహరించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, గెలిచి నిలిచిన నాయకుడు. కానీ ఐదేళ్ల కాలంలోనే ఆ చరిష్మా ఒక్కసారిగా మాయమై చివరికి సిట్టింగ్ సీటును కూడా దక్కించుకోలేని పరిస్థితి ఆయనకి ఎదురైంది.

Amit Shah Fake Video: అమిత్ షా నకిలీ వీడియో సృష్టి తెలంగాణలోనే.. తేల్చిన ఢిల్లీ పోలీసులు!

రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా ఎడిట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియో సృష్టించింది తెలంగాణలోనేనని తేలింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ (IFSO Unit) ఐపీ అడ్రస్ ఆధారంగా వీడియో సృష్టించిన ప్రదేశం తెలంగాణలోనే ఉందని గుర్తించింది.

PM Modi: తనను పెద్దన్న అంటున్న సీఎం రేవంత్‌పై ప్రధాని మోదీ కామెంట్ ఇదే…

అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారుకు గోల్డ్‌ మెడల్‌, అంతకు ముందున్న బీఆర్ఎస్‌ సర్కారుకు సిల్వర్‌ మెడల్‌ వస్దుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన చోట ఇప్పుడు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌తో జనాల్ని పీడిస్తున్నారని మోదీ తెలిపారు.

Telangana: కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..

ఆసిఫాబాద్ జనజాతర బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమురంభీం ఆసిపాబాద్ జిల్లాలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై అనేక ఆరోపణలు చేశారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆదిలాబాద్ సమస్యలను వినిపించేందుకు ఆదివాసీ ఆడబిడ్డకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. ఆసిఫాబాద్‎కు ఒక ప్రత్యేకత ఉందని.. ఆసిఫాబాద్ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తుందని చరిత్రను గుర్తు చేశారు.

  • Srikar T
  • Updated on: May 2, 2024
  • 5:59 pm

Telangana: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్‌గా గాడిద గుడ్డు

గాడిద గుడ్డే కదా అని లైట్ తీసుకోకండి. ఇప్పుడిదే గుడ్డు.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో నడినెత్తిన తైతక్కలాడుతోంది. రెండు పార్టీలు కయ్యానికి కాలుదువ్వేలా చేస్తోంది. హాట్‌హాట్‌గా సాగుతున్న క్యాంపెయిన్‌ హీట్‌లో.. ఈ గుడ్డు గోలేంటి? మైకుల్లో ఎందుకు మార్మోగుతోంది?

‘న్యాయపరంగా పోరాటం చేస్తాం’.. నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్..

ఢిల్లీ పోలీసుల నోటీసులపై పీసీసీ లీగల్‌ సెల్‌ నేతలు సమాధానం ఇచ్చారు. సీఎంకు ఇచ్చిన నోటుసులపై కాంగ్రెస్ లీగల్ సెల్‌ సభ్యులు నాలుగువారాల గడువును కోరారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జి మన్నే సతీష్‌తోపాటు నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్‌లకు కూడా రెండు వారాల గడువు కోరారు. సాంకేతికపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేసుకునేందుకు ఈ రెండు వారాలు గడువు కోరినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక సభ ఎన్నికలు జరుగుతున్నాయి.

  • Srikar T
  • Updated on: May 1, 2024
  • 3:23 pm

Osmania University: స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్…హాస్టల్స్ కి నో సమ్మర్ హాలిడేస్ హాస్టల్ మెస్ ఓపెన్

విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వేసవి సెలవుల కాలంలో యూనివర్సిటీ హాస్టల్‌లు పనిచేస్తాయని ప్రకటించింది. ఈ నిర్ణయం క్యాంపస్‌లో తిరిగి ఉండాలనుకునే విద్యార్థులకు వసతి కల్పించడానికి ఉద్దేశించబడింది. వారి పరీక్ష ప్రిపరేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని విద్యార్థులు ఈ సమ్మర్ హాలిడేస్ లో హాస్టల్ లోనే ఉండవచ్చునని యూనివర్సిటీ రిజిస్టార్ ఓ ప్రకటన జారీ చేశారు.

షర్మిల, చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ ఛానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అందని.. అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం, పోటీ చేయడం తనకు బాధ కలిగించదన్నారు. షర్మిల పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని షర్మిల ఎలాగు ఓడిపోతుందన్నారు.

Lok Sabha Elections 2024: ‘400 సీట్లలో బీజేపీ విజయం సాధించేలా ముందుకెళ్తున్నాం’.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

లోక్ సభ ఎన్నికల వేళ ఓటమి భయంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బిజెపిని నిలువరించే ఆలోచనతో జతకట్టార్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తోడుగా ఎంఐఎం పార్టీ కుమ్మక్కై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లు తీసేస్తారని, హైదరాబాద్‎ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని తప్పుడు ప్రచారం చేస్తూ తలాతోక లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కిందస్థాయి నాయకులెవ్వరూ వారి మాటలను నమ్మడం లేదని చెప్పారు.

  • Srikar T
  • Updated on: Apr 29, 2024
  • 7:17 pm

Big News Big Debate: తెలంగాణలో రచ్చ రాజేసిన ఫేక్‌ వీడియో కేసు

అమిత్ షా ఫేక్ వీడియోను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో వీడియోను పోస్ట్‌ చేసిన టీపీసీసీకి నోటీసులు ఇచ్చారు అధికారులు. పీసీసీ ప్రెసిడెంట్‌ హోదాలో సీఎం రేవంత్‌ రెడ్డి మే 1న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

కాంగ్రెస్‎లో గుత్తా అమిత్.. కీలక పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం.. తండ్రి చేరికపై కొనసాగుతున్న సస్పెన్స్..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. సీనియర్‌ నాయకుడు, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఘర్ వాపసీలో పీసీసీ పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది. కొంతకాలంగా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకలాపాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఆపరేషన్లో భాగంగా రాష్ట్ర వ్యవహారాలు ఇన్చార్జి దీప్దాస్ మున్షి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరిలు గుత్తా అమిత్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.

Amit Shah Fake Video: అమిత్ షా ఫేక్ వీడియో దుమారం.. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు..

లోక్ సభ ఎన్నికలు ప్రచారం తారాస్థాయికి చేరుకుంది.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.. ఇప్పటికే.. రెండు విడతల పోలింగ్ ముగియగా.. మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.. ఈ సమయంలో రిజర్వేషన్ల విషయంలో అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల అంశంపై రాజకీయ రచ్చ నడుస్తుంటే, ఫేక్‌ వీడియోలు అంతకంటే జోరుగా సర్క్యులేట్‌ అవుతున్నాయి.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..