చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు

నారా చంద్రబాబు నాయుడు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుండి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన ఘనత సాధించారు. నారా చంద్రబాబు నాయుడు 1950 ఏప్రిల్ 20 ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నారు.

చంద్రగిరిలో విద్యార్థి నాయ‌కుడిగా 1973లో చంద్రబాబు రాజ‌కీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1978లో ఆయన కాంగ్రెస్ (ఐ) పార్టీలో చేరారు. ఆ ఏడాది చంద్రగిరి నియోకజవర్గం నుంచి కాంగ్రెస్ (ఐ) టికెట్‌పై పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 సంవత్సరాల వయస్సులో రాష్ట్రంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా ఘనత సాధించారు. 1980లో ఆయ‌న ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. కానీ కాంగ్రెస్ (ఐ)లోనే చంద్రబాబు కొనసాగారు. 1983 ఎన్నిక‌ల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెంట్రామ నాయుడి చేతిలో ఓట‌మి త‌ర్వాత‌, ఆయ‌న కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

1995 నుండి 2004 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశారు. తన హయాంలో హైదరాబాద్‌లో ఐటీ రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2003లో అలిపిరి మందుపాతర పేలుడు ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు. తన ఏకైక సంతానం, కుమారుడు నారా లోకేశ్ కు నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణి తో వివాహం చేసి నందమూరి కుటుంబంతో మరింత అనుబంధం పెంచుకున్నాడు.

యునైటెడ్ ఫ్రెంట్ ప్రభుత్వం కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కీలకంగా వ్యవహరించారు. ఏపీ రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ నాయకుడిగా చంద్రబాబు గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి

ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు.. వయా సచివాలయం..

ఏపీలో పెన్షన్‌ పరేషాన్‌ కంటిన్యూ అవుతోంది. గత నెలలో సచివాలయాల దగ్గర పడిగాపులు కాసిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ప్లేస్‌ మారిందే తప్పా.. అదే క్యూ, అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లబ్దిదారులు. పెన్షన్‌ పంపిణీలో రెండో కూడా ఎలాంటి మార్పు కనిపించలేదు. లబ్దిదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఈసారి పెన్షన్‌ నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి క్రెడిట్‌ అవ్వడంతో.. అవ్వతాతల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. బ్యాంక్‌ అకౌంట్స్‌ గురించి సరైన అవగాహన లేని వృద్దులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 7:48 pm

Watch Video: వృద్దాప్య పెన్షన్లు, కూటమి మేనిఫెస్టోపై వైఎస్ భారతి స్పందన.. చంద్రబాబుకు చురకలు..

పులివెందులలో సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి ప్రతిరోజూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేకించి మహిళలను ఆకట్టుకునే పనిలో ఉన్నారామె. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటున్నారు. పెన్షనర్ల అవస్థలు మళ్లీ జగన్ వస్తేనే తగ్గుతాయంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తనపాలనపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 6:24 pm

PM Modi: ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 5:31 pm

Watch Video: సీఎం జగన్ భూములు ఇచ్చే నేతే తప్ప లాక్కునే నాయకుడు కాదు.. కాటసాని రాంభూపాల్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాణ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిరీయస్ వార్నింగ్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు సీఎం జగన్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ నాయకులు కౌంటర్ దాడి చేస్తున్నారు. సీఎం జగన్‎పై చంద్రబాబు నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం అని హెచ్చరించారు. వయసుకు తగ్గట్లు, రాజకీయ అనుభవానికి తగినట్లుగా చంద్రబాబు మాట్లాడకుండా హింసను ప్రేరేపించేలా రెచ్చగొడుతూ నేరానికి పాల్పడుతున్నారన్నారు.

AP Politics: భూమి చుట్టూ ఏపీ రాజకీయం.. ఎన్నికల వేళ లాండ్‌ టైట్లింగ్‌ యాక్టు రచ్చ

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ హాట్ టాపిక్‌గా మారింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ తొలిసారిగా ఈ వివాదంపై స్పందించారు.

ఏపీ ఎన్నికల్లో ఆ పార్టీకే ఎంఐఎం మద్ధతు.. చంద్రబాబుపై అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలపై స్పందించారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ. రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత ఓటర్లను కోరారు. ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత అసద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

  • Srikar T
  • Updated on: May 1, 2024
  • 5:29 pm

YS Jagan: చంద్రబాబుకు ఫోన్‌ వచ్చింది.. అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు

కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్‌ చేసింది.. మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి.. మోదీ ఫొటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది .. అందుకే ఫొటో పెట్టలేదంటూ సీఎం జగన్‌ ఆరోపించారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయింది.. కూటమిలోని ముగ్గురి ఫొటోలు పెట్టుకునే పరిస్థితిలేదు.. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారు అంటూ ఫైర్ అయ్యారు.

TDP-Janasena-BJP: మేనిఫెస్టో సాక్షిగా కూటమిలో కుంపటి.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు..

సీట్ల సర్దుబాటు జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే.. అంతర్గతంగా ఇంకేదో జరిగిపోతోంది.. ఈ క్రమంలోనే పొత్తు.. ఉందా లేదా..? ఉంటే ఇలా జరుగుతుందేంటి..? ఎన్నికల వేళ ఈ గొడవలేంటి..? ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్‌లో ఇప్పుడు సరికొత్త సందేహాలు వెంటాడుతున్నాయి.

షర్మిల, చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు.. జాతీయ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే..

చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుట్రలో తన సోదరి వైఎస్ షర్మిల భాగస్వామ్యం అయ్యారని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓ జాతీయ ఛానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సోదరి వైఎస్ షర్మిలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వాళ్ళలో చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అందని.. అదే పార్టీలో వైఎస్ షర్మిల చేరడం, పోటీ చేయడం తనకు బాధ కలిగించదన్నారు. షర్మిల పోటీ చేసినా డిపాజిట్లు కూడా దక్కవని షర్మిల ఎలాగు ఓడిపోతుందన్నారు.

‘చంద్రబాబుకు పెన్షనర్ల ఉసురు తగులుతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కీలక వ్యాఖ్యలు..

చంద్రబాబు, ఆయన ముఠా కారణంగానే పెన్షనర్లకు ఈ అవస్థలు అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవ్వాతాతలకు ప్రతి నెలా ఇస్తున్న పెన్షన్ విధానానికి చంద్రబాబు అండ్ టీం అడ్డుతగలడంపై ఫైర్ అయ్యారు. 2014-2019 మధ్య ఏం జరిగిందనేది ప్రజలు మరిచిపోలేదని చంద్రబాబు పాలనను గుర్తు చేశారు.

  • Srikar T
  • Updated on: Apr 29, 2024
  • 6:56 pm

YS Jagan: పేదలకు, మోసాలకు మధ్య జరిగే ఎన్నికలు.. ఆలోచించి ఓటు వేయండి.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

జగన్‌ను ఎందుకు ఓడించాలి..? బాబుకు ఎందుకు ఓటు వేయాలో మీరే ఆలోచించాలంటూ జగన్‌ ప్రజలను కోరారు. 2014లో మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు మోసాలు చేశారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మరోసారి వైసీపీ ప్రభంజనం తప్పదన్నారు సీఎం జగన్‌. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలు క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. ఎక్కడా తగ్గేదేలే అంటూ పేర్కొన్నారు.

Watch Video: టీడీపీకి షాక్ ఇచ్చిన మహిళా నేత.. రాజీనామాతో కంగుతిన్న క్యాడర్..

ఎన్నికల వేళ తిరుపతి పార్లమెంట్‌ పరిధిలో టీడీపీకి షాక్‌ తగిలింది. బొజ్జల సుధీర్‌రెడ్డి మానసికంగా వేధిస్తున్నారంటూ తిరుపతి తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్‌ పుట్టిస్తోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

  • Srikar T
  • Updated on: Apr 28, 2024
  • 8:47 pm

Watch Video: ‘రాత్రికి రాత్రి సంపద ఎలా సృష్టిస్తారు బాబు’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కౌంటర్..

చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చేందుకు వీలుండదన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు హామీలపై విమర్శించారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు మళ్లీ సిద్దమయ్యారని అన్నారు. ఎన్నికల ముందు వందల హామీలను ఇవ్వడం చంద్రబాబుకు అలవాటని అన్నారు.

  • Srikar T
  • Updated on: Apr 28, 2024
  • 3:44 pm

Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో మేనిఫెస్టో మంత్రం! ఆచరణ సాధ్యం ఏది? జనామోదం పొందేది ఏది?

ఏపీలో ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. అధికార వైసీపీ మరోసారి జనాకర్షక మేనిఫెస్టోతో ప్రజలకు ముందుకు రావడంతో.. రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే ఉన్న నవరత్నాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్తామంటున్న జగన్‌... పేదలకు ఇచ్చే ఆర్థికసాయాన్ని విడతలవారీగా పెంచుతామంటున్నారు. మరి, ఇప్పటికే సూపర్‌ సిక్స్‌ నినాదాన్ని ఎత్తుకున్న విపక్ష కూటమి... వైసీపీకి ధీటుగా ఎలాంటి ఎన్నికల ప్రణాళికను తీసుకొస్తుందన్నదే ఆసక్తిరేపుతోంది.

‘ఏపీలో వైసీపీ అధికారంలోకి రాబోతుంది’.. సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్..

వైసీపీ అధికారంలోకి రాబోతుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో ఇదే కూటమి జతకట్టిందని గుర్తు చేశారు. కాపు సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా చంద్రబాబుకు వేయించాలని పవన్ కళ్యాణ్ విశ్వప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయపడుతున్నారని చురకలంటించారు.

  • Srikar T
  • Updated on: Apr 24, 2024
  • 4:49 pm