నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ

నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.

నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.

2014 లోక్‌సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.

తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.

ఇంకా చదవండి

PM Modi: ఏపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ విడుదల..

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మూడో సారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడం కోసం దేశ వ్యాప్తంగా చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో 10 రోజుల్లో ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 5:31 pm

PM Modi: భయపడ్డారు.. పారిపోయారు.. రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, టీఎంసీతోపాటు కాంగ్రెస్ నేత రాహుల్ టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. బెంగాల్‌లో హిందువులు సురక్షితంగా లేరని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi: ప్రత్యేక శైలితో ప్రజా రాజకీయ నాయకుల హృదయాలను గెలుచుకుంటున్న నరేంద్ర మోదీ

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి సంబంధించి బీజేపీ నేతలు పలు వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు మాజీ బిజూ జనతా దళ్ నాయకుడు మరియు ఎంపీ భర్తృహరి మహతాబ్ ఒక వీడియోను పంచుకున్నారు. చాలా మంది ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీని సంరక్షకుడిగా వ్యవహరిస్తున్నారని ఇందులో ఆయన చెప్పారు.

Modi on Third Front: కేసీఆర్ థర్డ్‌ ఫ్రంట్‌ డైలాగ్‌కి మోదీ కౌంటర్.. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

ఆప్షన్‌1, ఆప్షన్2, ఆప్షన్3 అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ.. ఫస్ట్ ఆప్షన్‌కి నో చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్‌ని కూడా తిరగ్గొట్టేశారు ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రధాని మోద క్లారిటీ ఇచ్చేశారు.

PM Modi: తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే.?

తెలుగు మీడియాలోని ఓ సెన్సేషన్. బిగ్గెస్ట్ ఇంటర్వ్యూతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది టీవీ9 నెట్‌వర్క్. ప్రధానమంత్రి అండ్‌ 5 ఎడిటర్స్‌ ప్రోగ్రాం యావత్ దేశమంతా.. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. ఈ ప్రోగ్రాంలో తెలుగు ప్రజల తరపున ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు టీవీ9 మేనేజింగ్‌ ఎడిటర్‌ రజినీకాంత్.

Modi on BJP: మ్యాజిక్‌ ఫిగర్‌ స్థానాల్లో పోటీ చేయలేని పార్టీలు ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తాయిః మోదీ

దేశ ప్రజలంతా ఇప్పుడు దేశ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని ప్రధాని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల గురించి, ప్రధానిగా ఎవరిని ఎంచుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారో మోదీ క్లారిటీ ఇచ్చారు. ఒక్క తెలంగాణలోనే కాదు యావత్ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉందంటున్నారు ప్రధాని మోదీ. ఇండియా కూటమి ఇబ్బందుల్లో ఉందని, కనీసం ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందంటున్నారు.

PM Modi TV9 Interview: నాపై ఒక్క మచ్చ కూడా లేదు.. నిజాయితీతో ఏదైనా సాధ్యమవుతుంది: ప్రధాని మోదీ

టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై విపక్ష నేతలందరినీ ప్రధాని మోదీ సూటిగా ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కొందరికి ఏటీఎంగా మారిందని.. మళ్లీ తెలంగాణ ఏటీఎంగా తయారైందన్నారు. అంతటా అవినీతి వ్యవహారం ఉంది.

PM Modi: ‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బెంగాల్ పాత్ర కీలకం’.. మహిళా సాధికారతపై మోదీ సందేశం..

మూడో దశలో మే 7న నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత పోలింగ్‌కు ముందు ప్రధాని మోదీ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. బెంగాల్‌ను సందర్శించే ముందు, ప్రధాని మోదీ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి వ్యూహం, దేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సామాజిక, ఆర్థిక దృక్కోణంలో దేశానికి చాలా ముఖ్యమైన రాష్ట్రాలు దేశంలో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 7:24 am

PM Modi Interview: టీవీ9తో ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ.. టాప్-9 హైలెట్స్ ఇవే..

లోక్‌సభ ఎన్నికల వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, TV9 నెట్‌వర్క్‌‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. టీవీ9 గ్రూప్‌కు చెందిన ఐదుగురు మేనేజింగ్ ఎడిటర్లు వివిధ అంశాలకు సంబంధించి అడిగిన.. ప్రశ్నలకు క్లియర్ కట్ సమాధానాలు ఇచ్చారు. ఇంటర్వ్యూ టాప్ 9 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం...

PM Modi: కేసీఆర్ సంకీర్ణ ప్రభుత్వం కామెంట్‎పై మోదీ స్పందన..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్.. నేషనల్ పాలిటిక్స్‌లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్రమంత్రి యోగం ఉందన్న కేసీఆర్ మాటల్లో మర్మం ఏంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు మోదీ.

  • Srikar T
  • Updated on: May 2, 2024
  • 10:03 pm

PM Narendra Modi TV9 Interview: నమ్మకం విశ్వాసంగా.. విశ్వాసం గ్యారెంటీగా మారింది.. మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయిందని, 2024 వచ్చేసరికి ఆ విశ్వాసం గ్యారెంటీగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని టీవీ9 నెట్‌వర్క్‌ ఫైవ్‌ ఎడిటర్స్‌ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు.

PM Modi: తనను పెద్దన్న అంటున్న సీఎం రేవంత్‌పై ప్రధాని మోదీ కామెంట్ ఇదే…

అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్‌ సర్కారుకు గోల్డ్‌ మెడల్‌, అంతకు ముందున్న బీఆర్ఎస్‌ సర్కారుకు సిల్వర్‌ మెడల్‌ వస్దుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన చోట ఇప్పుడు ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌తో జనాల్ని పీడిస్తున్నారని మోదీ తెలిపారు.

PM Modi TV9 Exclusive Interview: అప్పుడు కమ్యూనిస్టులు.. ఇప్పుడు తృణముల్.. బెంగాల్ రాజకీయాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరింది.. దేశం మొత్తంతో పాటు బెంగాల్ లోక్ సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలకు గాను 18 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. అప్పటినుంచి కాషాయదళం.. బెంగాల్ పై దృష్టిసారించింది. ఈసారి కాషాయపార్టీ బెంగాల్ నుంచి 30 నుంచి 35 సీట్లు దక్కించుకోవాలని వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

PM Modi: ‘రాముడు మోదీకి, బీజేపీకి మాత్రమే చెందిన వాడు కాదు.. అందరివాడు’.. ప్రధాని మోదీ

రాముడి విషయంలో విపక్షాలను ప్రధాని నరేంద్ర మోదీ టార్గెట్ చేశారు. 'రాముడు మోదీకి మాత్రమే కాదు, బీజేపీకి మాత్రమే కాదు.. అందరికీ చెందినవాడు. ప్రతి ఒక్కరూ రాముడిని గౌరవించాలి. రాముడి వ్యక్తిత్వంతో పోలిస్తే బీజేపీ చాలా చిన్నది. అయోధ్యలో రామ్‌లల్లా దీక్ష సందర్భాన్ని దేశంలోనే కాకుండా విదేశాల్లోని వారంతా భావోద్వేగానికి గురైన తరుణంగా మోదీ అభివర్ణించారు. గురువారం టీవీ9 ఫైవ్‌ ఎడిటర్స్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఐదుగురు ఎడిటర్లు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు..

PM Modi: చంద్రబాబుతో పొత్తుకు బీజేపీ అంగీకారం అందుకే.. మోదీ కీలక వ్యాఖ్యలు..

'ప్రధానమంత్రి అండ్‌ 5-ఎడిటర్స్‌' ప్రోగ్రామ్‌లో ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు ప్రధాని మోదీ. ఈసారి 400 ఎంపీ స్థానాలు గెలవడం కాదు.. ఆల్రెడీ 400 సీట్లు తమ దగ్గరే ఉన్నాయంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏ దగ్గర 360 సీట్లు ఉన్నాయన్నారు ప్రధాని. ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో పాటు మిగతా వారిని కూడా కలుపుకొంటే తమ దగ్గర 400 సీట్లు ఉన్నట్టేనని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ అడిగి ప్రశ్నకు సమాధానమిచ్చారు.

  • Srikar T
  • Updated on: May 3, 2024
  • 7:28 am
Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?