నరేంద్ర మోదీ
నరేంద్ర మోదీ ప్రస్తుత భారత ప్రధాని. 2014 మేలో తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఘన విజయం సాధించడంతో మోదీ వరుసగా రెండోసారి దేశ ప్రధాని అయ్యారు. దేశ ప్రధాని కావడానికి ముందు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో అనుబంధం కలిగి ఉన్నారు. గతంలో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో కూడా పనిచేశారు. ఆయన గుజరాత్లోని వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు.
2014 లోక్సభలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విజయం సాధించింది. దీని తర్వాత, 2019లో కూడా బీజేపీ ఘన విజయం సాధించి, మోదీ మళ్లీ భారత ప్రధాని అయ్యారు. 2014 నుంచి బీజేపీ మోదీ పేరును ప్రధాన అస్త్రంగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికల్లో విజయం సాధించింది.
తన హయాంలో, ప్రధాని మోడీ చాలా సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. ఇది అయనపై దేశ ప్రజల్లో ఆదరణను మరింత పెంచింది. ఈ నిర్ణయాలలో పాకిస్థాన్లో సర్జికల్ స్ట్రైక్స్, పెద్ద నోట్ల రద్దు, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, ట్రిపుల్ తలాక్ చట్టం అమలు మొదలైనవి ఉన్నాయి.
యుద్ధం సాకుగా పాకిస్తాన్ భారత్పై నీచమైన చర్యకు పాల్పడుతోందిః రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పొరుగు దేశానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం (ఏప్రిల్ 2) పాకిస్థాన్ పేరు ప్రస్తావించకుండానే దానిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పొరుగు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరైనా భారతదేశంపై దుస్సాహసానికి పాల్పడవచ్చన్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 2, 2026
- 1:09 pm
ప్రపంచ సంక్షోభం వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కీలక సుంకాలు రద్దు..!
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా నెలకొన్న ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎరువుల కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కల్పించింది. అమ్మోనియం నైట్రేట్పై దిగుమతి సుంకాన్ని మాఫీ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పలు పెట్రోకెమికల్ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాన్ని ఎత్తివేసింది.
- Balaraju Goud
- Updated on: Apr 2, 2026
- 11:41 am
లోక్సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!
అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత లోక్సభ ముందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు తీసుకువచ్చారు. అయితే లోక్సభలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 1:07 pm
తేయాకులు కోసి, సెల్ఫీ తీసుకుంటూ.. టీ తోటలో చిరస్మరణీయ అనుభూతిని పొందిన ప్రధాని మోదీ
అస్సాం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శైలిలో కనిపించారు. దిబ్రుగఢ్లోని ఒక తేయాకు తోటలో కార్మికులను ప్రధాని మోదీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి మహిళలతో ముచ్చటించారు. వారితో కలిసి తేయాకు ఆకులు కోశారు. మహిళా కూలీల కోరిక మేరకు వారితో సెల్ఫీలు తీసుకున్నారు.
- Balaraju Goud
- Updated on: Apr 1, 2026
- 11:39 am
Amaravati: అమరావతికి రాజముద్ర.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు.. లైవ్ వీడియో
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు ద్వారా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించనుంది కేంద్ర ప్రభుత్వం.. లోక్సభలో కేంద్రహోంశాఖ సహాయ మంద్రి నిత్యానంద రాయ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత అంశంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది.
- Shaik Madar Saheb
- Updated on: Apr 1, 2026
- 12:16 pm
వదంతులకు దూరంగా ఉండండి.. ఏ కష్టమొచ్చిన కలిసికట్టుగా ఎదురుకుందాంః ప్రధాని మోదీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (మార్చి 29, 2026) ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియో 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం యొ132వ ఎపిసోడ్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, "ఈ మార్చి నెల ప్రపంచవ్యాప్తంగా చాలా అల్లకల్లోలంగా గడిచింది. కోవిడ్ కారణంగా యావత్ ప్రపంచం చాలా కాలం పాటు అనేక సమస్యలను ఎదుర్కొన్న విషయం మనందరికీ గుర్తుంది. కరోనా సంక్షోభాన్ని అధిగమించిన తర్వాత ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 29, 2026
- 12:48 pm
విమానాశ్రయాలు కేవలం సౌకర్యం మాత్రమే కాదు.. దేశ పురోగతిని ప్రతిబింబిస్తాయిః ప్రధాని మోదీ
భారతదేశంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం కేరళ. రాష్ట్ర పర్యాటకం, గల్ఫ్ దేశాలలో పెరుగుతున్న కేరళీయుల జనాభా దీనికి కారణం. అయితే, జేవార్ విమానాశ్రయం ప్రారంభంతో, ఈ పోటీలో ఉత్తర ప్రదేశ్ కేరళను అధిగమించింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగి రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించింది.
- Balaraju Goud
- Updated on: Mar 28, 2026
- 1:50 pm
‘భారత్తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను..’ ప్రధాని మోదీకి నేపాల్ ప్రధాని బాలెన్ లేఖ!
నేపాల్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలెన్ షాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. ప్రధాని మోదీ పోస్ట్కు నేపాల్ ప్రధాని బాలెన్ స్పందించారు. ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీతో కలిసి పనిచేయడానికి తాము ఆసక్తిగా ఉన్నామని నేపాల్ ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
- Balaraju Goud
- Updated on: Mar 28, 2026
- 12:19 pm
పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్ – అమెరికా కీలక చర్చలు.. మోదీ – ట్రంప్ మధ్యలో మస్క్..?
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన చర్చలు జరిపారు. ఈ సంభాషణలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నారని న్యూయార్క్ టైమ్స్ మీడియా ప్రచురించింది. మార్చి 24న ఫోన్లో మోదీ, ట్రంప్ చర్చలు చర్చించారు. అయితే రెండు దేశాల అగ్ర నాయకుల మధ్య జరిగే సంభాషణలో ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం అసాధారణం.
- Balaraju Goud
- Updated on: Mar 28, 2026
- 11:51 am
విమాన రంగంలో సంచలనం.. దేశంలోనే అతి పెద్ద విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం!
భారతదేశపు అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటైన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, తన మొదటి దశ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (మార్చి 28) నాడు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను, కార్గో టెర్మినల్ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ ఎంఆర్ఓ (MRO) సదుపాయానికి శంకుస్థాపన కూడా చేస్తారు.
- Balaraju Goud
- Updated on: Mar 28, 2026
- 9:16 am
PM Modi: అయోధ్యలో అద్భుత దృశ్యం.. రామ్ లల్లాకు సూర్యతిలకం.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధాని మోదీ
పవిత్రమైన రామ నవమి పర్వదినం రోజున, నలుమూలల నుండి అయోధ్యలోని రామనగరికి విచ్చేసిన భక్తులు ఒక అసాధారణమైన క్షణానికి సాక్ష్యమిచ్చారు. శుక్రవారం (మార్చి 27) సరిగ్గా 12 గంటలకు, అయోధ్యలోని అద్భుతం చోటు చేసుకుంది. రామ్ లల్లాకు సూర్య తిలకం దిద్దారు. సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై పడగానే, ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.
- Balaraju Goud
- Updated on: Mar 27, 2026
- 4:58 pm
‘ప్రధాని మోదీతో కలిసి ఉద్రిక్తతలను పరిష్కరిస్తాం..’ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన..!
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య దాదాపు నెల రోజులుగా యుద్ధం సాగుతోంది. మరోసారి అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు . "ప్రధాని మోదీ, నేను కలిసి మాత్రమే ఈ సంఘర్షణకు పరిష్కారం చూపగలము " అని ట్రంప్ పేర్కొన్నారు.
- Balaraju Goud
- Updated on: Mar 27, 2026
- 12:31 pm