ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులు

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి(విధాన పరిషత్) రాష్ట్ర శాసన వ్యవస్థలోని సభల్లో ఎగువ సభ అని అంటారు. 1958 నుండి 1985 వరకు, మరలా తిరిగి 2007 నుండి 2014 వరకు ఈ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉనికిలోవుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, 2014లోని సెక్షన్ 22 ప్రకారం రెండు రాష్ట్రాలకు శాసనమండలులు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలి కొనసాగుతుంది. శాసన మండలి శాశ్వత సభ. ఇందులో 58 మంది సభ్యులు ఉంటారు. సభ్యుల సాధారణ కాలపరిమితి ఆరు సంవత్సరాలు. అందులో 1/3 వంతు మంది ప్రతీ రెండు సంవత్సరాలకు సభ్యత్వం పూర్తి చేసుకుంటారు. కొత్త సభ్యులు ఎన్నికవుతారు. శాసనమండలి సభ్యుడిగా ఉండాల్సిన వ్యక్తికి భారత పౌరసత్వం కలిగి ఉండాలి. కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు కలిగి ఉండాలి. అతడు/ఆమె అదే కాలంలో పార్లమెంటు సభ్యునిగా ఉండరాదు. 20 మంది సభ్యులు శాసనసభ్యుల ద్వారా, 20 మంది సభ్యులు అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల సముదాయం ద్వారా, 10 మంది సభ్యులు పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుండి ఎన్నుకోబడతారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ద్వారా 8 మంది సభ్యులు నామినేట్ చేయబడతారు.

అభ్యర్థుల జాబితా 2024

రాష్ట్రం అభ్యర్థి పార్టీ సీటు
Andhra Pradesh Kinjarapu Atchannaidu TDP TEKKALI
Andhra Pradesh Dharmana Prasada Rao YSRC శ్రీకాకుళం
Andhra Pradesh Tammineni Sitaram INC AMADALAVALASA
Andhra Pradesh Dharmana Krishna Das YSRC NARASANNAPETA
Andhra Pradesh Botsa Satyanarayana YSRC CHEEPURUPALLI
Andhra Pradesh GANTA SRINIVASA RAO TDP BHIMILI
Andhra Pradesh Konathala Rama Krishna JSP ANAKAPALLE
Andhra Pradesh Vanga Geetha YSRC PITHAPURAM
Andhra Pradesh PAWAN KALYAN KONIDALA JSP PITHAPURAM
Andhra Pradesh Nimmakayala Chinarajappa TDP PEDDAPURAM
Andhra Pradesh Jyothula Nehru TDP JAGGAMPETA
Andhra Pradesh Thota Narasimham YSRC JAGGAMPETA
Andhra Pradesh Kolusu Parthasarathy TDP NUZVID
Andhra Pradesh Y. Sujana Chowdary BJP VIJAYAWADA WEST
Andhra Pradesh Nara Lokesh TDP MANGALAGIRI
Andhra Pradesh Nadendla Manohar JSP TENALI
Andhra Pradesh Kanna Lakshminarayana TDP SATTENAPALLE
Andhra Pradesh Kotamreddy Sridhar Reddy TDP NELLORE RURAL
Andhra Pradesh YS Jagan Mohan Reddy YSRC PULIVENDULA
Andhra Pradesh Bhuma Akhila Priya TDP ALLAGADDA
Andhra Pradesh Buggana Rajendranath YSRC DHONE
Andhra Pradesh Butta Renuka YSRC YEMMIGANUR
Andhra Pradesh Payyavula Keshav TDP URAVAKONDA
Andhra Pradesh Paritala Sunitha TDP RAPTADU
Andhra Pradesh Nandamuri Balakrishna TDP హిందూపూర్
Andhra Pradesh Kethireddy Venkatarami Reddy YSRC DHARMAVARAM
Andhra Pradesh Nallari Kishore Kumar Reddy TDP PILERU
Andhra Pradesh Peddireddy Ramachandra Reddy YSRC PUNGANUR
Andhra Pradesh R.K. ROJA YSRC NAGARI
Andhra Pradesh Nara Chandrababu Naidu TDP KUPPAM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ చివరి ఎన్నికలు 2019లో జరిగాయి. ఏప్రిల్ 11, 2019న ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల రోజు ముగిసే సమయానికి 79.88% ఓటింగ్ నమోదైంది, ఇది 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కంటే 1.92% ఎక్కువ. ఈ ఎన్నికల్లో 15,545,211 మంది పురుషులు, 15,787,759 మంది మహిళా ఓటర్లు తమ ఓటు వేశారు. 39,345,717 మంది ఓటర్లలో మొత్తం 31,333,631 మంది ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.93%, గుంటూరు జిల్లాలో 82.37 %, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 73.67% పోలింగ్ నమోదైంది. అద్దంకి నియోజకవర్గంలో అత్యధికంగా 89.82%, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో అత్యల్పంగా 58.19% ఓటింగ్ నమోదైంది.

FAQ’s: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2024కు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు:-

ప్రశ్న:- శాసనమండలి సభ్యుడిగా అర్హత సాధించాలంటే ఎన్ని ఏళ్లు నిండి ఉండాలి.?

సమాధానం:- భారత పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు కనీసం 30 ఏళ్ళ వయసు ఉండాలి

ప్రశ్న:- శాసనసభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?

సమాధానం:- అర్హులైన ఓటర్లు తమ ఓటు ద్వారా ప్రత్యక్షంగా శాసనసభ్యులను ఎన్నుకుంటారు.

ప్రశ్న:- శాసనసభలో మెజార్టీ కోసం ఎంత మంది సభ్యులు కావాలి?

సమాధానం:- శాసనసభలో మెజార్టీ కోసం 88 మంది సభ్యుల మద్ధతు కావాలి.

ప్రశ్న:- ఎన్నికల్లో అభ్యర్థులు డిపాజిట్ కోల్పోవడం అంటే ఏంటి?

సమాధానం:- నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో ఆరో వంతు కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి తాను నామినేషన్ దాఖలు సమయంలో చెల్లించిన డిపాజిట్‌ను కోల్పోవాల్సి ఉంటుంది.

ఎన్నికల వార్తలు 2024

ఎన్నికల వీడియో