అయోధ్య రామమందిరం

అయోధ్య రామమందిరం

శతాబ్దాల స్వప్నం సాకారం అయ్యే ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రపంచంలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్న ఈ మహా సంబురం వేళ అయోధ్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది. విశ్వ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతున్న అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక పరిమళాలతో విరాజిల్లబోతోంది. లక్షలమంది హాజరయ్యే భవ్య రామ మందిర మహా సంరంభ వేడుకకు నభూతో నభవిష్యత్ అన్నరీతిలో ఏర్పాట్లు జరిగాయి. ఈ మహాత్కార్యంలో తామూ భాగస్వాములయ్యేందుకు భక్తజనం ఉవ్విళ్లూరుతోంది. జగదానంద కారక..జయ జానకి ప్రాణ నాయక ..శుభ స్వాగతం..ప్రియా పరిపాలక మంగళకరం నీరాక…మా జీవనమే పావనమవుగాక…అంటూ భక్తకోటి ఆశ్రీరాముడ్ని తలచుకుని పాడుతోంది. భవ్యరామమందిరంలో మన రామయ్య కొలువయ్యేనాటికి ఎన్నో అద్భుతాలు సాత్కారించబోతున్నాయి. ఆ అద్భుత మహాయజ్ఞంలో మన తెలుగోళ్ల పాత్రఘనంగా ఉంది.

2024 జనవరి 22న రామ్‌లల్లా విగ్రహా ప్రతిష్టాపన..భవ్య కార్యక్రమానికి దివ్య ముహూర్తం నిర్ణయమైంది. ఆ రోజు మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల శుభ ముహుర్తాన విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. అంటే శతాబ్దాల యావత్ హిందువుల కల 84 సెకన్లలో పరిపూర్ణమవుతుంది. మేషలగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఆ పవిత్ర సమయంలో గురు ఉచ్చస్థితి ఉండవల్ల రాజయోగం కలుగుతుంది. సాధారంగా 5 గ్రహాలు అనుకూలంగా ఉంటే అది అత్యంత శుభముహుర్తంగా పరిగణిస్తారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సమయంలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉండడం మరో విశేషం.
భూకంపాలు..సునామీ..ఎలాంటి ప్రళయాలు వచ్చినా సరే..అయోధ్య ఠీవీ ఇంచుమించు మాత్రం కూడా చెక్కు చెదరదు. అయోధ్య భవ్య రామమందిరం అర్కిటెక్చర్‌ను చూసి ప్రపంచం అబ్బురపడుతోంది.

ఇంకా చదవండి

PM Modi: బాల రాముడిపై సూర్యతిలకాన్ని దర్శించిన ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్..

ప్రధాని మోదీ బుధవారం అసోంలోని నల్భరీలో ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అయితే ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో ఏర్పడే అద్భుత ఘట్టాన్ని నేరుగా తిలకించలేకపోయారు. కానీ ఎన్నికల షెడ్యూల్‎లో బిజీగా ఉన్నప్పటికీ అసోంలోని నల్బరీ ర్యాలీలో పాల్గొన్న తరువాత తిరుగుప్రయాణంలో తన ప్రత్యేక హెలీకాఫ్టర్‎లో అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ.

  • Srikar T
  • Updated on: Apr 17, 2024
  • 2:33 pm

Sri Rama Navami 2024: బాలరాముడి నుదుటిని ముద్దాడనున్న సూర్యుడు.. అయోధ్యలో అద్భుత దృశ్యం.. ఈ ఒక్క రోజు మాత్రమే..

శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు అతని నుదుటిపై దేద్ధీప్యామానంగా వెలిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం గర్భగుడిలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు. శాస్త్ర సూత్రం ప్రకారం శ్రీరాముని సూర్య అభిషేకం జరుగుతుంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేసి గతంలో పలుమార్లు పరీక్షించి విజయవంతమయ్యారు. ఇక్కడ విశేషమేమిటంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది.

Ram Navami 2024: అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. ! ఇవీ పూర్తి వివరాలు..

శ్రీరామనవమి పురస్కరించుకుని అన్ని ఆలయాల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. శ్రీరామ నవమి రోజున స్వామి వారికి అన్ని రకాల పూలు పళ్లతో పాటు పానకం, బెల్లం, వడపప్పు వంటి వాటిని కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు.

Ayodhya: బాల రామయ్యకు 5కోట్ల విలువైన బంగారు రామాయణం.. ఘనంగా ప్రారంభమైన నవమి వేడుకలు

దాదాపు 500 ఏళ్ల తర్వాత బాల రామయ్య జన్మ దినోత్సవ వేడుకలను (శ్రీ రామ నవమిని) ఘనంగా జరపడానికి శ్రీ రామ జన్మ భూమి ట్రస్ట్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు శ్రీ రామ నవమి సందర్భంగా భక్తులు బాల రామయ్యకు కానుకలను సమర్పిస్తున్నారు. తాజాగా ఓ విశ్రాంత ప్రభుత్వ అధికారి రామయ్య భక్తుడు బాల రామయ్యకు బంగారు రామాయణాన్ని కానుకగా సమర్పింహ్చాడు. ఏడు కిలోల బంగారం ఉపయోగించి తయారు చేసిన  బంగారు పేజీలపై వ్రాసిన ఈ రామాయణం రామయ్య గర్భగుడిలో ప్రతిష్టించబడింది.

Flights: రామ్‌లల్లా భక్తులకు గుడ్‌న్యూస్‌.. హైదరాబాద్‌నుంచి డైరెక్ట్‌ ఫ్లైట్‌.

అయోధ్య రామయ్యను దర్శించాలనుకునే వారికి ఇది శుభవార్తే. హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఏప్రిల్‌ 2 నుంచి వారానికి మూడు రోజులు అంటే మంగళ, గురు, శనివారాల్లో విమాన సేవలు అందుబాటులో ఉంటాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్స్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ నుంచి రామ‌జ‌న్మభూమి అయోధ్యకు వెళ్లేందుకు ఇప్పటికే రైలు స‌ర్వీసులు చాలా అందుబాటులోకి వ‌చ్చాయి.

Ram Lalla: బాలుడిని అయోధ్య బాలరాముడిలా మార్చేసిన దంపతులు.! ఎందుకంటే.?

అయోధ్య రామయ్యపై ఉన్న భక్తితో ఆర్టిస్టులైన దంపతులు 9 ఏళ్ల బాలుడిని అచ్చం రామ్ లల్లా గా మార్చేశారు. పొరపాటున కాదు.. ఎలా చూసినా ఆ బాలుడు అచ్చం అయోధ్య రామయ్యలానే కనిపిస్తుండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ దంపతుల కృషికి ప్రశంసలు కురిపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌కు చెందిన ఆశిష్‌కుందు తన భార్య రూబీ సహకారంతో ఓ బాలుడిని బాల రామయ్యలా మార్చేశాడు.

Upasana Konidela: అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్న ఉపాసన.. తాతయ్యతో  కలిసి ప్రత్యేక పూజలు.. వీడియో

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. భర్త తో కలిసి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె ఇప్పుడు మాత్రం తన తాత, నాయనమ్మలతో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు.

Ayodhya: అయోధ్య రామాలయంపై నోరు పారేసుకున్న తృణమూల్ ఎమ్మెల్యే.. హిందువులు వెళ్లొద్దు అంటూ పిలుపు

తారకేశ్వర్‌లోని టీఎంసీ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటనపై పెను దుమారం చెలరేగింది. రామేందు సిన్హా చేసిన ఈ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామేందు సిన్హా చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అంటూ ఖండిస్తున్నారు. రామేందు సిన్హాపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హిందువులపై దాడులు చేసే నేచర్ పెరిగిపోయింది అంటూ సువేందు అధికారి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Ayodhya: ఇక నుంచి అయోధ్య హనుమాన్ ప్రసాదాన్ని ఇంటి నుంచే పొందండి.. పూర్తి వివరాలు మీ కోసం..

భారతదేశం అంతటా శ్రీ హనుమాన్ గర్హి దేవాలయం ప్రసాదాన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా అందజేయనుంది పోస్టల్ శాఖ. భక్తులు తమకు సమీపంలోని పోస్టాఫీసుకు ఈ-మనీ ఆర్డర్ పంపడం ద్వారా ప్రసాదాన్ని ఆర్డర్ చేయవచ్చు. ఇదే విషయంపై వారణాసి, ప్రయాగ్‌రాజ్ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఏ మూలన ఉన్న భక్తులైనా స్పీడ్ పోస్ట్ సర్వీస్ ద్వారా శ్రీ హనుమాన్ గర్హి ఆలయ ప్రసాదాన్ని ఇంటి వద్దకే పొందవచ్చు అని వెల్లడించారు.

Ayodhya: బాల రామయ్యను దర్శించుకున్న ముస్లిం భక్తులు.. మోడీ మాట ప్రపంచం మొత్తం వింటుందని ప్రశంసలు..

ప్రధాని మోడీ చెప్పిన మాటలు భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం వింటుందని.. అంగీకరిస్తుందని MRM పేర్కొంది. అంతేకాదు ఉలేమాలు, మౌలానాలు అని పిలవబడే వారు ..  ఇస్లాం పేరుతో తమ రాజకీయ భవిష్యత్ కోసం  ప్రయత్నిస్తున్నారని.. అలంటి ప్రతిపక్ష నాయకులను పూర్తిగా బహిష్కరించాలని అసంఖ్యాక ముస్లింలు కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది. అయోధ్యలో ఆలయ నిర్మాణంపై ముస్లిం సమాజం స్పందిస్తూ.. అయోధ్యలోని రామ మందిరం హిందువుల విశ్వాసానికి కేంద్రమని, మెజారిటీ జనాభా విశ్వాసాన్ని గౌరవించాలని స్పష్టం చేసింది.

Ayodhya: అయోధ్య రామయ్యకు రూ.25 కోట్ల విరాళాలు.! తొలి నెలలో అయోధ్యను భక్తులు 60 లక్షలు.

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠాపనకు ఒక నెల పూర్తయ్యింది. జనవరి 22న వైభవోపేతంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగగా ఫిబ్రవరి 21తో నెల పూర్తయ్యింది. భక్తులు పెద్ద సంఖ్యలో బాలరాముడిని దర్శించుకుంటున్నారు. కానుకలు, విరాళాలను కూడా పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. మొదటి నెల రోజుల ఆదాయాన్ని అయోధ్య రామాలయం ట్రస్ట్ ప్రకటించింది.

Ayodhya: అయోధ్య రామాలయానికి నెల రోజుల్లో భారీ విరాళాలు.. ఎంతో తెలిస్తే షాకవుతారు

రామ్ లల్లాకు బహుమతులుగా లభించిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను కరిగించి నిర్వహణ కోసం భారత ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించినట్లు రామ్ మందిర్ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. విరాళాలకు సంబంధించి ఎస్‌బీఐతో ట్రస్టు ఎంఓయూ కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎంఓయూ ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విరాళాలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, చెక్కులను సేకరించడం, వాటి సేకరణను నిర్ధారించడం, తరువాత..

Ayodhya Deeksha: అయోధ్య రామ మందిరం కోసం దశాబ్దాలుగా దీక్ష.. చివరికి ఇలా..!

అయోధ్యలో రామ మందిర నిర్మాణం అనేదీ కోట్లాది మంది హిందువుల కల. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో ఏళ్ల తరబడి అయోధ్య కేసు సాగగా.. రాముడికి గుడి కట్టాలని హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేపట్టారు. ఎందరో త్యాగాల ఫలితంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని జనవరి 22న రామ్ లల్లా ప్రతిష్ట పూర్తి చేసుకుంది.

Ayodhya: బాల రామయ్య దర్శనం ఇక నుంచి మరింత సులువు.. సగం దర్శనం, హారతిని ముందుగా బుక్ చేసుకోవచ్చు..

సుగం దర్శనం లేదా హారతి సేవ కోసం భక్తులు ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సేవలను ట్రస్ట్ పూర్తిగా భక్తులకు ఉచితంగా అందిస్తుంది. పాస్ లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బుకింగ్ రెండిటి ద్వారా తీసుకోవచ్చు. 'సుగం దర్శన' పాస్ హోల్డర్లకు ప్రత్యేక క్యూ సిస్టమ్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 'సుగం దర్శనం' కోసం ప్రతి రెండు గంటల వ్యవధిలో ఆరు స్లాట్‌లున్నాయి. 

Ayodhya: అయోధ్యలో హోటళ్లకు ఫుల్ డిమాండ్.. అసలు కారణమిదే

ఇటీవలనే అయోధ్యలో అంగరంగ వైభవంగా రామమందిరం దేశ ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ ఆలయం అందుబాటులోకి రావడంతో దేశ నలుములాల నుంచి భక్తుల అయ్యోధ రామయ్యను చూసేందుకు తరలివస్తున్నారు. అయితే అయోధ్యలో భక్తుల సంఖ్య ఎలా పెరుగుతూ వస్తోందో, అందుకనగుణంగా హోటళ్లు పుట్టుకొస్తున్నాయి.

విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
రుద్రాణి ప్లాన్ సక్సెస్.. అప్పూ, కళ్యాణ్‌లు జైలుకు.. పాపం అనామిక!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..